టీడీపీలో చురుగ్గా వ్యవహరించిన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గణపతి నాగ సత్యనారాయణరావు మృతి బాథాకరమని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. అంబాజీపేటలో అయన సంతాపసభ బుధ వారం సర్పంచ్ నాగాబత్తుల శాంతకుమారి అధ్యక్షతన జరిగింది. బాబులు చిత్రపటానికి పలువురు నాయకులు పూలమాలలువేసి నివాళులర్పించారు. అలాగే అంబాజీపేట నాలుగు రోడ్ల జంక్షన్లో బాబులు చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. జడ్పీ మాజీ చైర్మన్ నామన రాంబాబు, మాజీ ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, గొల్లపల్లి సూర్యారావు, పాముల రాజేశ్వరిదేవి, నాయకులు మెట్ల రమణబాబు, అల్లాడ సోంబాబు, దాసరి వీరవెంకట సత్యనారాయణ, బొంతు పెదబాబు, చిన్నం బాలవిజయరావు, మోకా ఆనందసాగర్, అరిగెల బలరామమూర్తి, నాగాబత్తుల సుబ్బారావు, దంతులూరి శ్రీనురాజు, కొర్లపాటి కోటబాబు, పేరి శ్రీను, శిరిగినీడి వెంకటేశ్వరరావు, వక్కలంక బుల్లియ్య, ఆయిల్మిల్లు అసోషియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa