ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విలక్షణమైన నటుడు చిరంజీవి...ప్రధాని నోట మెగాస్టార్ మాట

national |  Suryaa Desk  | Published : Mon, Nov 21, 2022, 08:29 PM

మనదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎపుడూ రాజకీయాల  గురించే కాదు అపుడప్పుడు ఇతర అంశాలపై కూడా స్పందిస్తుంటారు.  ఇఫీ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ప్రారంభం సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్-2022 పురస్కారం ప్రకటించడం తెలిసిందే. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.  చిరంజీవి విలక్షణమైన నటుడు అని కొనియాడారు. విశిష్ట నటనా చాతుర్యంతో భిన్న రకాల పాత్రలు పోషించి కొన్ని తరాల ప్రేక్షకుల అభిమానాన్ని, ఆదరణను చూరగొన్నారని వివరించారు. తన అద్భుతమైన వ్యక్తిత్వంతో ఆకట్టుకున్నారని కితాబునిచ్చారు. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ పురస్కారం అందుకుంటున్నందుకు చిరంజీవిని అభినందిస్తున్నానని తెలిపారు. ఇదిలావుంటే ప్రధాని మోదీ అభినందనల పట్ల చిరంజీవి బదులిచ్చారు. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. మీ అభినందనలను ఎంతో గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ప్రశంసాపూర్వకమైన మీ మాటలు సంతోషదాయకం అని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa