ఆంధ్ర భద్రాద్రిగా పేరుగాంచిన ఒంటిమిట్టకు గురువారం జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి పాదయాత్ర చేయనున్నారని ఆయన సలహాదారుడు మంగళవారం వెల్లడించారు. ప్రతి ఏడాది తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన ఒంటిమిట్టకు చేరుకుని అక్కడ కొలువైన కోదండరాముడిని దర్శించుకుంటారు.
ఈ ఏడాది తిరుమల పాదయాత్ర ముగించుకున్న జడ్పీ చైర్మన్ గురువారం ఉదయము 6 గంటలకు అకేపాడు లో నూతనంగా నిర్మించిన సీతారాముల ఆలయం నుండి పాదయాత్ర ప్రారంభమవుతుందని అన్నారు. హస్తవరం, గుండ్లూరు, నందలూరు, మంటపంపల్లి, చెర్లోపల్లి మీదుగా పాదయాత్ర సాగి ఒంటిమిట్టను చేరుకుని ఆయన తలనీలాలు స్వామివారికి సమర్పించి మొక్కులను తీర్చుకుంటారని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa