ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోసం, వెన్నుపోటు పొడిచేవారికి మరోఛాన్స్‌ ఎవరైనా ఇస్తారా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Nov 24, 2022, 08:27 AM

బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష (రీ సర్వే) పత్రాల పంపిణీని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా బ‌హిరంగ స‌భ‌లో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడారు. చంద్రబాబులా దుష్టచతుష్టయాన్ని నేను నమ్ముకోలేదు. నేను దేవుడిని, ప్రజలను నమ్ముకున్నానని సీఎం వైయస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చెప్పారు. మీ ఇంటిలో మంచి జరిగిందా.. లేదా.. ఇదే కొలమానం పెట్టుకోండి. మంచి జరిగితే మీ బిడ్డకు అండంగా ఉండండి అని సీఎం వైయ‌స్ జగన్‌ కోరారు.  రాజకీయమంటే జవాబుదారీతనం.. ప్రజలకు మంచి చేస్తేనే ఎవరినైనా ఆదరిస్తారనే మెసేజ్‌ పోవాలని  వైయ‌స్ జ‌గ‌న్ అన్నారు. వెన్నుపోటు పొడిచిన నాయకుడిని అసెంబ్లీకి పంపాలా?..మీ సేవలు వద్దు బాబూ అంటూ బైబై చెప్పి ఇంటికి పంపాలా అని ఆలోచన చేయాలని సూచించారు. మోసం, వెన్నుపోటు పొడిచేవారికి మరోఛాన్స్‌ ఎవరైనా ఇస్తారా? అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa