ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐలాండ్‌లో కొండ చరియలు విరిగిపడి...8 మంది మరణం... 13 మంది గల్లంతు

business |  Suryaa Desk  | Published : Sun, Nov 27, 2022, 03:57 PM

ఐలాండ్ లో విషాధకర ఘటన చోటుచేసుకొంది. ఇటాలియన్ హాలిడే ఐలాండ్‌లో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 13 మంది గల్లంతైనట్టు తెలుస్తుంది. అక్కడ రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఇస్షియా ద్వీపానికి ఉత్తరాన ఉన్న కాసామిసియోలా టెర్మ్‌లో శనివారం తెల్లవారుజాము సమయంలో కొండ చరియలు విరిగిపడ్డాయి.


కొండచరియలు విరిగిపడడంతో భారీగా మట్టి, రాళ్లు కింద ప్రాంతంలో ఉన్న ఇళ్లపై పడింది. దాంతో ఆ ఇళ్లలో ఉన్న వారు మట్టి, రాళ్లు కింద చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. సంబంధిత అధికారులు, సిబ్బంది అక్కడకు చేరుకుని చనిపోయిన వారిని గుర్తించి వారి బంధువులకు అప్పగించే ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో కనిపించకుండా పోయిన మరో 13 మంది కోసం రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.


కొండ చరియలు విరిగిపడి 8 మంది చనిపోయిన విషయాన్ని ఇటలీ మంత్రి మాటియో సాల్విని ధ్రువీకరించారు. "ఇస్షియా కొండచరియలు విరిగిపడటంతో ఎనిమిది మంది మరణించారు. రెస్క్యూ సిబ్బంది క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తున్నారు" అని ఆయన చెప్పారు.


అయితే గల్లంతైన వారిలో ఇద్దరు భార్యాభర్తులు, ఇటీవల వారికి జన్మించిన ఓ శిశువు ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా వర్షాల కారణంగా బురద కొండ పైనుంచి కింద పడడంతో కింది ప్రాంతంలో ఉన్న పలు కార్లు నాశనం అయ్యాయి. అంతేకాదు ఒక వాహనం సముద్రంలో కొట్టుకుపోయింది. అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులను అగ్నిమాపక శాఖ అధికారులు కాపాడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa