ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన ఎంట్రీలతో యావత్తు ప్రపంచానికి ఝలక్ ఇస్తున్నారు. తాజాగా ఆయన రెండో సారి రెండో కూతురితో జనం మధ్యకు వచ్చారు. దీంతో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వారసులు ఎవరనేది తీవ్ర చర్చ జరుగుతోంది. ఇటీవల తన కుమార్తెతో బయటకు వస్తున్న కిమ్.. తన తదనంతరం పాలనా పగ్గాలు ఆమెకే అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. 9 నుంచి 10 ఏళ్ల మధ్య ఉండే రెండో కుమార్తె చువేయ్.. వారం వ్యవధిలో కిమ్తో బయటకు రావడం గమనార్హం. ఆమె అంటే కిమ్కు ఎంతో ఇష్టమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వాస్తవానికి భార్య తప్ప కుటుంబసభ్యులు ఎవర్నీ బయట ప్రపంచానికి చూపించడానికి కిమ్ ఇష్టపడరు. దీనికి భిన్నంగా తరచూ.. తన రెండో కూతురు చువేయ్తో కలిసి అధికారిక కార్యక్రమాలకు హాజరవుతున్నారు.
తాజాగా, క్షిపణి శాస్త్రవేత్తలతో సమావేశానికి చువేయ్ను వెంటబెట్టుకెళ్లిన ఫోటోలను ఉత్తర కొరియా అధికారిక మీడియా కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కిమ్ తర్వాత ఉత్తర కొరియా పగ్గాలను చువేయ్ చేపడతారనే చర్చ జరుగుతోంది. గత వారం తల్లిదండ్రులతో ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని చువేయ్ వీక్షిస్తున్న ఫోటోలను తొలిసారి అధికారికంగా విడుదల చేశారు. వారం తిరగకుండానే క్షిపణి శాస్త్రవేత్తలతో ఆమె ఉన్న ఫోటోలను తాజాగా విడుదల చేయడం గమనార్హం.
అమెజాన్ షియోమీ బ్లాక్ ఫ్రైడే సేల్ ఆఫర్లు | రెడ్మి స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపు ధరలు
కిమ్ జోంగ్ ఉన్, ఆయన రెండో కుమార్తె చువేయ్లు కొరియా క్షిపణి శాస్త్రవేత్తలు, సాంకేతిక సిబ్బంది, అధికారులతో గ్రూప్ ఫోటో దిగారు. ‘కిమ్, ఆయన కుమార్తె పట్ల అమితమైన గౌరవం వ్యక్తం చేయడంతో ఆనందంతో నిండిపోయారు’ KCNA నివేదించింది. ఈ సందర్భంగా కిమ్ మాట్లాడుతూ... ‘పోటీలో ఉన్న బలమే విజయాన్ని నిర్ణయించే వర్తమాన ప్రపంచంలో మనల్ని అత్యంత బలవంతులుగా మార్చినప్పుడు మాత్రమే దేశ భవిష్యత్తును మనం రక్షించుకోగలం అనేది చరిత్ర బోధించిన సత్యం’ అని అన్నారు.
‘శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు "డూ-ఆర్-డై పోరాటం చేయాలి... తద్వారా దేశం అణు యుద్ధ నిరోధకాన్ని అనూహ్య వేగంతో విస్తరించి బలోపేతం చేయాలి’ అని కిమ్ పిలుపునిచ్చారు. ఉత్తర కొరియా ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న అత్యంత శక్తివంతమైన హస్వాంగ్-17 బాలిస్టిక్ క్షిపణికి శాస్త్రవేత్తలు, సిబ్బంది తుదిమెరుగులు దిద్దుతున్నారు. అమెరికా భూభాగాన్ని చేరుకునే సామర్ధ్యం ఉన్న ఈ క్షిపణిని గత నెలలో పరీక్షించారు.
కిమ్ రెండో కుమార్తె ఆయనకు ఎంతో విలువైందని కేసీఎన్ఏ పేర్కొంది. ఆయనకు అత్యంత ప్రియమైన కూతురుగా అభివర్ణించింది. కిమ్ సతీమణి రిసోల్ జు అధికారిక వ్యవహారాలకు దూరంగా ఉంటారు. కిమ్ తర్వాత అత్యంత శక్తివంతురాలిగా సోదరి కిమ్ యో జోంగ్ గుర్తింపు పొందారు. అధికారికంగా తన సోదరుడి తర్వాత కార్యక్రమాలను ఆమె చూసుకుంటారు. స్టేట్ ఎఫైర్స్ కమిటీ సభ్యురాలిగా, సమాచార, ప్రచార విభాగం డిప్యూటీ డైరెక్టర్ పదవులతో పాటు విదేశీ వ్యవహారాలను కూడా ఆమె చూసుకుంటారు. అందుకే తరచూ పొరుగు దేశం దక్షిణ కొరియా, అమెరికాలను తీవ్ర పదజాలంతో విమర్శిస్తుంటారు. 2009లో వివాహమైన కిమ్కు ముగ్గురు సంతానం ఉన్నట్టు దక్షిణ కొరియా మీడియా చెబుతోంది. మొదటి సంతానంగా 2010లో కొడుకు.. 2013, 2017 కుమార్తెలు జన్మించారని తెలిపింది. రెండో కుమార్తె గురించి ఇప్పటివరకూ ఎక్కడా పెద్దగా చర్చ జరగలేదు. నిజానికి కిమ్ జోంగ్ ఉన్కు ఎంతమంది సంతానం అనేది అధికారిక సమాచారం లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa