ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇలాంటి సమాజంలో సవాళ్లు కూడా ఎక్కువే...జస్టిస్ ధనంజయ చంద్రచూడ్

national |  Suryaa Desk  | Published : Sun, Nov 27, 2022, 04:03 PM

భారత దేశంలో భిన్నత్వం ఎక్కువేనని... ఇలాంటి సమాజంలో సవాళ్లు కూడా ఎక్కువేనని జస్టిస్ ధనంజయ వై.చంద్రచూడ్  అన్నారు. న్యాయం అందరికీ అందేలా న్యాయ వ్యవస్థ చూడాలని సూచించారు. అదే సందర్భంలో వ‌ర్చువ‌ల్ విధానం వల్ల లాయర్లు త‌మ సొంత ప్రదేశాల నుంచే కేసుల్ని వాదించే అవ‌కాశం వ‌చ్చింద‌ని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. కేసుల లిస్టింగ్ విష‌యంలో టెక్నాల‌జీని ఉపయోగించుకోవాలని సీజేఐ అన్నారు.


న్యాయ వ్యవస్థ ప్రజలకు చేరువకావడం చాలా అవసరమని, కోర్టు చుట్టూ ప్రజలు తిరిగేలా చేయకూడదని ఆయన అన్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సుప్రీంకోర్టులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అందరికీ న్యాయం అందాల్సిన అవసరాన్ని జస్టిస్ చంద్రచూడ్ నొక్కి చెప్పారు. న్యాయవ్యవస్థలో సాంకేతిక విప్లవం వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరికి న్యాయం అందేలా చేయాలన్నారు.


"సుప్రీంకోర్టు తిలక్‌మార్గ్‌లో ఉన్నప్పటికీ... దేశం మొత్తానికి సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం. లాయర్లు వారి సొంత ప్రదేశాల నుంచి కేసులను వాదించడానికి వీలు కల్పించింది." అని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. అదే విధంగా న్యాయవాద వృత్తిలో అట్టడుగు వర్గాల ప్రాతినిధ్యాన్ని తప్పనిసరిగా పెంపొందించాలని సీజేఐ అన్నారు. భారతదేశంలోని మన న్యాయస్థానాల నుంచి వెలువడిన న్యాయశాస్త్రం దక్షిణాఫ్రికా, కెన్యా, ఆస్ట్రేలియా, జమైకా, ఉగాండా, బంగ్లాదేశ్, సింగపూర్, ఫిజీలలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా పలు నిర్ణయాలను ప్రభావితం చేసిందని చెప్పారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa