పట్టపగలు మణప్పురం గోల్డ్ ఫైనాన్స్లో భారీ చోరీ జరిదింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. కొంతమంది దుండగులు మణప్పురం గోల్డ్ ఫైనాన్స్లోకి వెళ్లి.. తుపాకులతో బెదిరించి బంగారం, నగదు దోచుకెళ్లారు. అందిన కాడికి దోచేసుకున్నారు. మొత్తం ఊడ్చేశారు. కట్నీ జిల్లాలోని రంగనాథ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బార్గన్వా ప్రాంతంలో ఇది జరిగింది. ఉదయం 10:30 గంటల సమయంలో ఆరుగురు వ్యక్తులు మణప్పురం గోల్డ్ ఫైనాన్స్ ఆఫీసులోకి వెళ్లారు.
ఆయుధాలు పట్టుకుని ముఖం కనిపించకుండా కవర్ చేసుకుని, తలకు హెల్మెట్ పెట్టుకుని లోపలకి ప్రవేశించారు. ఆ తర్వాత తుపాకిని బయటకు తీసి ఫైనాన్స్లో పనిచేస్తున్న ఉద్యోగులపై దాడి చేశారు. వారిని పక్కకు తీసుకెళ్లి... లాకర్లను తెరిచి బంగారం, నగదును బ్యాగుల్లో నింపుకుని అక్కడ నుంచి పరారయ్యారు. కేవలం 10 నుంచి 15 నిమిషాల్లో ఇదంతా జరిగిపోయింది. ఈ మేరకు 16 కిలోల బంగారం, రూ.3.5 లక్షల నగదును లూటీ చేశారు.
అయితే లాకర్ను ఓపెన్ చేసిన సమయంలో సైరన్ మోగడంతో దొంగలు వీలైనంత తొందరగా అక్కడి నుంచి పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడకు వెళ్లి.. నిందితు లకోసం గాలింపు మొదలుపెట్టారు. ఫోరెన్సిక్ బృందాలు కార్యాలయంలోని వేలిముద్రలు సేకరించాయి. పోలీసులు డాగ్ స్క్వాడ్తో గాలించారు. అలాగే పోలీసులు ప్రధాన రోడ్లపై ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. దుండగులు చొరబడి, తుపాకులతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారని ఏఎస్పీ మనోజ్ కేడియా వెల్లడించారు. అలాగే నిందితులు జబల్పూర్ వైపు వెళ్లినట్లుగా సమాచారం ఉందని ఆయన అన్నారు.
అలాగే ప్రధాన కార్యాలయం నుంచి సీపీ టీవీ ఫుటేజీని తీసుకుని పరిశీలిస్తామని ఏఎస్పీ చెప్పారు. అనంతరం నిందితులు 16 కిలోల బంగారం, రూ.3.56లక్షలు ఎత్తుకు వెళ్లినట్లు మణప్పురం గోల్డ్ లోన్ ఫైనాన్స్ సేల్స్ మేనేజర్ ధ్రువీకరించారు. అలాగే దుండగులు ఆఫీసులో మహిళా ఉద్యోగిని మినహా అందరినీ కొట్టారని చెప్పారు అలాగే ఎత్తుకెళ్లిన బంగారం విలువ రూ.8 కోట్లు ఉంటుందని చెప్పారు. ఇదిలా ఉండగా దొంగలు అంత సులభంగా దోచుకెళ్లడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. కార్యాలయం దగ్గర భద్రతా ఏర్పాట్లపై ప్రశ్నలు వస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa