ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇకనైనా మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం మానుకోవాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 30, 2022, 11:35 AM

ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై సుప్రీం కోర్టు తీర్పు తెలుగుదేశం పార్టీ కి చెంపపెట్టు అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. బెలుగుప్ప మండలం కాలువపల్లి లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. వికేంద్రీకరణ పై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను స్వాగతిస్తున్నట్లు చెప్పారు.రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయించే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అనే విషయం సుప్రీం తీర్పుతో బలపడిందన్నారు.కోర్టు తీర్పు తోనైనా చంద్రబాబుకు కనువిప్పు కలగాలని మాజీ ఎమ్మెల్యే అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa