కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల రద్దీ కాస్త తగ్గుముఖం పట్టింది. శ్రీనివాసుని సర్వదర్శనానికి దాదాపు 18 గంటల సమయం పడుతోంది. శ్రీవారి దర్శనం కోసం 3 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచిచూస్తున్నారు. బుధవారం రోజు వేంకటేశ్వరుడిని 69,640 మంది దర్శించుకున్నారు. 28,694 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీనివాసుని హుండీకి రూ.4.65 కోట్ల ఆదాయం లభించిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa