బీసీలపై జగన్ రెడ్డి మొసలి కన్నీరు కారుస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. జనసేన నేత రామచంద్రయాదవ్, బీసీ నేత రామచంద్రయాదవ్ ఇళ్లపై దాడి దుర్మార్గమన్నారు. ప్రజా సమస్యలపై గళమెత్తితే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. బీసీలను అణచివేసేలా జగన్ రెడ్డి వ్యవహారం ఉందన్నారు. రైతు సమస్యలపై సభ పెట్టడమే నేరం అన్నట్లుగా దాడి చేశారని విమర్శించారు. రామచంద్రారెడ్డి అరాచకానికి, జగన్ రెడ్డి దుర్మార్గానికి ఈ దాడి నిదర్శనమన్నారు. బీసీలను అణగదొక్కుతూ.. జయహో బీసీ అంటూ సభ పెట్టే అర్హత జగన్ రెడ్డికి ఉందా? అని ప్రశ్నించారు. బీసీలపై పడే ఒక్కో దెబ్బా.. 2024లో జగన్ రెడ్డికి బీసీలు సమాధానం చెబుతారని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa