సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే ఆదర్శవంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ను అప్పులకుప్పగా మార్చిన ఘనత జగన్రెడ్డిదేనని ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్బాబు ఆరోపించారు. మండలంలోని తిమ్మాపురం, హసనాబాద్, కటకానిపల్లె, రామచంద్రకోట గ్రామాల్లో ‘ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గూడూరి ఎరిక్షన్బాబు దళిత కాలనీల్లో ప్రతి ఇంటి.కి వెళ్లి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బడుగుబలహీన వర్గాల ప్రజలకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. గత ప్రభుత్వంలో అమలుజేసిన అభివృద్ధి పనులు, అందించిన సంక్షేమ పథకాలు గుర్తు చేశారు. ఎస్సీ-ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మల్లించారన్నారు. కార్పొరేషన్ల ద్వారా ఇచ్చే రుణాలు, అంబేద్కర్ విదేశీ విద్య పథకం, బుక్ బ్యాంక్ పథకాలను నీరుగార్చారని విమర్శించారు. బ్యాక్లాగ్ పోస్టులు, కారుణ్య నియామకం లేకపోవడం ధారుణమన్నారు. జీవో 172 అమలు ద్వారాపిల్లలు విద్యకు దూరం అయ్యారని మండిపడ్డారు. ఇలా దళితులకే 29 పథకాల్లో అన్యాయం చేశాడని విమర్శించారు. ఏ కాలనీలోనైనా సిమెంటురోడ్డు వేశారా, ఒక్క వీధి దీపం వెలిగించారా ..? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏమీ చేయలేదు కానీ లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని దివాళా తీశారని ఇలాంటి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని ఆయన ప్రజలను కోరారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఏర్వ మల్లికార్జునరెడ్డి, నాయకులు షేక్ మాబు, బట్టు సుధాకర్ రెడ్డి, దొడ్డా శేషాద్రి, ఈదర మల్లయ్య, దేసు నాగేంద్రబాబు, చంటి, షేక్ సమ్మద్ భాష, వై.చెంచయ్య, షేక్ ఇస్మాయిల్, షేక్ భాష, కటికల శ్రీనివాసులు, కే దానం, రావిక్రింధి సుబ్బరత్నం, నాగెళ్ల సత్యనారాయణ, శాసనాల చలమయ్య, మౌలాలి, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa