దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు ఫ్లాట్గా ముగిశాయి. వరుస లాభాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ వైపు మొగ్గు చూపారు. ఈ క్రమంలో మార్కెట్లు లాభనష్టాల మధ్య కొనసాగి చివరకు ఫ్లాట్గా ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సరికి సెన్సెక్స్ 33 పాయింట్లు నష్టపోయి 62,834 వద్ద నిలిచింది. నిఫ్టీ 5 పాయింట్ల లాభంతో 18,701 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : టాటా స్టీల్ (3.35%), ఎన్టీపీసీ (1.66%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.58%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.38%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.61%).
టాప్ లూజర్స్ : రిలయన్స్ ఇండస్ట్రీస్ (-1.46%), టెక్ మహీంద్రా (-1.33%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.76%), డాక్టర్ రెడ్డీస్ (-0.73%), యాక్సిస్ బ్యాంక్ (-0.61%).
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa