ఎన్నికలు దగ్గరపడేకొద్దీ తెలుగుదేశం నేతలు ప్రతి అంశాన్నీ రాజకీయం చేస్తున్నారని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు, ఆయన కంపెనీ చేస్తున్న దుష్ప్రచారం జనం నమ్మరంటే నమ్మరని తెలిపారు. ఏ విషయంలోనైనా పొంతన లేని ‘వాస్తవాలు’ వెలికితీసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపైనా, పాలకపక్షమైన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపైన బురదజల్లుతున్నారు. గుంటూరు టీడీపీ ఎంపీ కుటుంబ యాజమాన్యంలోని అమరరాజా బ్యాటరీస్ తన విస్తరణ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రాంతాన్ని ఎంపికచేసుకుంటే దానికి కారణం ఏపీ ప్రభుత్వమేనని టీడీపీ నేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన అనుకూల పత్రికలు చేస్తున్న అబద్ధాల ప్రచారం నాటి గోబెల్స్ ప్రాపగాండాను మించిపోయింది. కార్పొరేట్ కంపెనీలు తమ ఫ్యాక్టరీలను ఏ ప్రాంతంలో పెట్టాలనే విషయాన్ని నిర్ణయించడానికి వ్యాపార కారణాలనే మొదట, చివరా పరిగణనలోకి తీసుకుంటాయి. ఒక్కోసారి ఒక రాష్ట్ర ప్రభుత్వ ఎన్ని రాయితీలు కల్పిస్తున్నా ఆ రాష్ట్రంలో ఒక పరిశ్రమ స్థాపనకు అన్ని వ్యాపార అంశాలూ అనుకూలంగా లేకుంటే ఏ కంపెనీ అయినా ఆ పని చేయదు. చెన్నై, బెంగళూరు, పుణె సమీపంలో ఆటోమొబైల్ కంపెనీలు తమ తయారీ యూనిట్లు పెట్టడానికి పూర్తిగా వ్యాపార పరిస్థితులే కారణం అని అయన తెలియజేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa