ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్లో ఓవర్ రేట్ కారణంగా టీమీండియాకు జరిమానా

sports |  Suryaa Desk  | Published : Tue, Dec 06, 2022, 11:41 PM

బంగ్లాదేశ్ తో తొలి వన్డేలో ఓడిపోయిన టీమిండియాకు స్లో ఓవర్ రేట్ జరిమానా పడింది. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి యలేదన్న కారణంగా టీమిండియా మ్యాచ్ ఫీజులో 80 శాతం జరిమానాగా విధించారు. భారత జట్టు నిర్ణీత సమయానికి 4 ఓవర్లు తక్కువగా బౌలింగ్ చేసినట్టు మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగళే గుర్తించారు. ఇది ఐసీసీ నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం తప్పిదం. ఒక ఓవర్ కు 20 శాతం చొప్పున మ్యాచ్ ఫీజులో కోత విధిస్తారు. ఆ లెక్కన టీమిండియా నిర్ణీత సమయానికి 4 ఓవర్లు తక్కువగా బౌలింగ్ చేయడంతో 80 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తప్పిదాన్ని అంగీకరించడంతో తదుపరి విచారణ అవసరంలేకుండా జరిమానాతో సరిపెట్టారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa