18 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయని, యుద్ధానికి సిద్ధంగా ఉండాలని వైసీపీ నేతలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపిచ్చారు. ప్రస్తుతం ఉన్న 151 అసెంబ్లీ స్థానాల కంటే ఇంకా ఎక్కవగా.. మొత్తం 175 సీట్లనూ దక్కించుకోవడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. మారీచులూ, పెత్తందారులతో యుద్ధం చేయక తప్పదని.. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు గట్టి బుద్ది చెప్పాలని స్పష్టం చేశారు. వైసీపీ బీసీ విభాగం చైర్మన్ జంగా కృష్ణమూర్తి అధ్యక్షతన బుధవారం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన ‘జయహో బీసీ’ కార్యక్రమం నిర్వహించారు. బీసీ వర్గాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ, ఎంపీపీ చైర్పర్సన్లు, సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. వారినుద్దేశించి ముఖ్యమంత్రి సుదీర్ఘంగా ప్రసంగించారు. మూడున్నరేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించారు. ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని.. ప్రభుత్వం వల్ల లబ్ధి జరిగిందని భావిస్తేనే ఓటేయాలని అడగాలని వారికి సూచించారు. మానవతావాదానికి జగన్ ప్రతీక అని తనను తాను అభివర్ణించుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa