ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్‌, కలెక్టరేట్‌ ఎదుట మహాధర్నా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 08, 2022, 04:29 PM

పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని ఈ నెల 16న కర్నూలు జిల్లాలో చేపట్టే కాలినడక యాత్రను విజయవంతం చేయాలని ఏపీ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రయ్య పిలుపునిచ్చారు. బుధవారం సీఆర్‌ భవన్‌లో రైతురక్షణ కాలినడక యాత్ర కరపత్రాలను నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్‌లో వేసిన పత్తి, వేరుశనగ, ఉల్లి, మిరప తదితర పంటలు దెబ్బతిని పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి అందని పరిస్థితి నెలకొందని అన్నారు. నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈనెల 20వ తేదీన కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట జరిగే మహాధర్నాలో రైతులు, ప్రజలు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa