ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ అవలంబిస్తున్న కొన్ని పద్ధతులు నచ్చకే పార్టీ నుంచి బయటకొచ్చా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 08, 2022, 04:32 PM

‘‘రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న విశ్వాసం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే వైసీపీ పాలన పూర్తిగా గాడి తప్పింది’’ అని సినీ నటుడు పృథ్వీరాజ్‌ తెలిపారు. ఈనెల 9న ‘ఏపీ 04 రామాపురం’ సినిమా విడుదల కానున్న సందర్భంగా బుధవారం ఆ సినిమా హీరో రామ్‌ జక్కల, హీరోయిన్‌ అఖిలతో కలిసి దర్గాను సందర్శించిన ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘వైసీపీ అవలంబిస్తున్న కొన్ని పద్ధతులు నచ్చకే పార్టీ నుంచి బయటకొచ్చా. నేను పార్టీలో ఉన్నంతవరకు పార్టీ కోసం కష్టపడ్డా. ప్రజలు వైసీపీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశారు’’ అని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa