రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు ని దేవరాపల్లి మండల తారువ గ్రామంలోని క్యాంప్ కార్యాలయంల మాడుగుల నియోజకవర్గానికి నూతనంగా నియమితులైన పార్టీ పరిశీలకులు ఊరుకూటి అప్పారావు, పార్టీ నాయకులు సుంకర శ్రీనివాసరావు, గోర్లే అప్పలనాయుడు. మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో మంత్రి ముత్యాల నాయుడు సహకారంతో పార్టీ క్యాడర్ మరింత బలోపేతం చేసేందుకు ఒక్కొక్క సచివాలయం పరిధిలోను ముగ్గురు కన్వీనర్ లను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నామని పార్టీ పరిశీలకులు అప్పారావు అన్నారు. సీఎం జగన్ ఆశయాలు ప్రజలకు నిత్యం చేరేవిధంగా ముగ్గురు కన్వీనర్ లలో ఒకరు మహిళ ఇద్దరు పురుషులు ఉంటారని, వాలంటీర్ పరిధిలో ఇద్దరు గృహ సారధులను ఏర్పాటు చేయనున్నట్లు అందులో ఒక మహిళ ఒకరు పురుషుడు నియమించి పార్టీ కార్యకలాపాలు సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసేందుకు వీరిని వారధులుగా నియమించ నున్నట్లు ఆయన తెలిపారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు వీరి సేవలను పార్టీ వినియోగించుకోనుంది. ఈనెల 20 లోగా మడుగులలో కన్వీనర్ నియామకం పూర్తి చేయనున్నట్లు అప్పారావు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa