పక్క రాష్ట్రాల ప్రజలపై విషం చిమ్మే మీకు.. జాతీయ రాజకీయాలలోకి వచ్చే అర్హత ఉందా అని ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంలో కేసీఆర్ ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన సూచించారు. ఇదిలావుంటే దేశవ్యాప్తంగా పోటీ చేసేందుకు గులాబీ దళపతి కేసీఆర్ రెడీ అవుతున్నారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే.. ఆంధ్రప్రదేశ్లోనూ పావులు కదుపుతున్నారు. ఈ సమయంలో.. కేసీఆర్ గతంలో చేసిన వ్యాఖ్యలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రా ప్రజలు, నేతలపై కేసీఆర్ చేసిన కామెంట్స్ను బీజేపీ లీడర్లు గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా.. ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి కేసీఆర్పై ఫైర్ అయ్యారు.
'బీఆర్ఎస్ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న కేసీఆర్.. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని పాలకులను పాపాత్ములుగా చిత్రీకరిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ప్రజలపై తెలంగాణ రాష్ట్ర విద్యార్థుల్లో విద్వేషాన్ని రేకెత్తించేలా పాఠాలను ఎందుకు లిఖించారు. పక్కరాష్ట్రాల ప్రజలపై విద్వేషాన్ని చిమ్ముతున్న మీ పూర్వీకులది విజయనగరం జిల్లా కాదా.. ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లి స్థిరపడిన మీపూర్వీకులు కూడా పాపాత్ములా?' అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. ఇంకా అనేక అంశాలను ఆయన ప్రస్తావించారు.
'పక్క రాష్ట్రాల ప్రజలపై విషం చిమ్మే మీకు.. జాతీయ రాజకీయాలలోకి వచ్చే అర్హత ఉందా? ఈ విషయంలో కేసీఆర్ ఆత్మవిమర్శ చేసుకోవాలి. 8వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకం నుంచి రాష్ట్రాల మద్య విద్వేషాన్ని రేకెత్తించేలా ఉన్న మీ స్వంత రాష్ట్రంలో ఆ పాఠాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాను. అప్పుడు మాత్రమే పక్క రాష్ట్రాల్లో పర్యటించే హక్కు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ బీజేపీ మీకు గుర్తు చేస్తోంది' అని విష్ణువర్ధన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa