రాష్ట్ర సంపదను, ప్రజాధనాన్ని దోచుకోవడమే వైసీపీ నైజమని టీడీపీ నాయకులూ గౌరు వెంకటరెడ్డి, డోన ఇనచార్జి ధర్మవరం సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. డోన పట్టణానికి చెందిన బీజేపీ నాయకుడు కృష్ణప్రసాద్తో పాటు మరో 50 కుటుంబాలు ఆదివారం కర్నూలులో గౌరు వెంకటరెడ్డి సమక్షంలో సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరాయి. ఆత్మకూరు ఇనచార్జి బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ సీఎం జగన పాలనతో రాష్ట్రాభివృద్ధి మరో 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని అన్నారు. అరాచకాలు, విధ్వంసాలతో రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేశారన్నారు. మూడు రాజధానుల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు సభలకు వస్తున్న జన ప్రభంజనంతో వైసీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. సుబ్బారెడ్డి మాట్లాడుతూ డోన నియోజకవర్గంలో వైసీపీ నాయకుల అవినీతి, అక్రమాలను కప్పి పుచ్చుకునేందుకు టీడీపీ నాయకులను బెదిరిస్తున్నారని, వారి ఆటలు ఎంతోకాలం సాగవని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa