అమలాపురంలోని ముస్లిం షాదీఖానాలోయునైటెడ్ షోటోకాన్ ఆధ్వర్యంలో మూడవ రాష్ట్రస్థాయి ఆహ్వాన కరాటే పోటీలను ఆదివారం నిర్వహించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలకు వివిధ జిల్లాల నుంచి 850మంది విద్యార్థులు హాజరయ్యారు. పవర్కిక్ షాటోకాన్ ఇండియా చీఫ్ హైదర్ ఆలీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన పోటీల్లో విజేతలకు నాయకులు మెట్ల రమణబాబు, వాసంశెట్టి సుభాష్, గంధం పల్లంరాజు, గంగుమళ్ల కాసుబాబు, వంటెద్దు వెంకన్నాయుడు, నల్లా అజయ్ షీల్డులు, సర్టిఫికెట్లు అందజేశారు. పోటీలను కరాటే ముఖ్యశిక్షకులు పడాల అంజి, పి.చంటి, సీహెచ్పనసయ్య, చిక్కం సురేష్ పర్యవేక్షిం చారు. తూర్పుగోదావరి జిల్లా జట్టు ప్రథమ, పశ్చిమ గోదావరి జిల్లా ద్వితీయ, విశాఖపట్నం తృతీయస్థానాల్లో నిలిచాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa