కర్నూలు జిల్లా నన్నూరులో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. తోటికోడళ్లైన రామేశ్వరి, రేణుకను పొలం వద్ద హత్య చేశారు. దుండగులు గొంతు కోసి హత్య చేశారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. వీరిని ఎవరు హత్య చేశారు? హత్య చేయడానికి కారణమేంటి? అనేవి మిస్టరీగా మారాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కర్నూలు జిల్లా ఓర్వకల్ మండలం నన్నూరులో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు మహిళలను గొంతు కోసి హత్య చేశారు దుండగులు. మృతులను రామేశ్వరి, రేణుకగా గుర్తించారు. వీరిద్దరూ తోటికోడళ్లు. పొలం వద్ద వీరు విగతజీవులుగా కనిపించారు. వీరిద్దరినీ ఎవరు హత్య చేశారు? ఎందుకు చంపాల్సి వచ్చింది? అనేది మిస్టరీగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలు ఏవైనా ఉన్నాయా? మరేదైనా కారణం ఏమైనా ఉందా అనేది తేలాల్సి ఉంది. ఒకే కుటుంబంలో ఇద్దరు మహిళల హత్యతో గ్రామంలో విషాదం నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa