వైసీపీ మంత్రులు జాతిరత్నాల్లా వ్యవహరిస్తున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ‘వారాహి’ ప్రచార రథంపై విమర్శలు చేస్తున్న మంత్రులకు మాండౌస్ తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులు మాత్రం గుర్తుకు రావడం లేదని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్లో రైతు భరోసా కేంద్రాలు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మారాయని ఆయన ఆరోపించారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో బుధవారం నాదెండ్ల మనోహర్ పర్యటించారు.పొలం పనులు చేస్తూ ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన జనసేన క్రియాశీల కార్యకర్త శ్రీమన్నారాయణ కుటుంబాన్ని నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. ఈ సందర్భంగ నారాయణపురంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద కార్యకర్త శ్రీమన్నారాయణ చిత్రపటానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు బీమా పరిహారం చెక్కును అందజేశారు. పార్టీ వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. వైవైసీపీ ప్రభుత్వ వైఖరి కారణంగా ఆక్వా రైతులు ఏకంగా పంట విరామ స్థితికి చేరుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి విరామం ప్రకటించేలా జనసైనికులు పోరాట పటిమ ప్రదర్శించాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు మండలాలకు చెందిన వైసీపీ నేతలు నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa