జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదిలావుంటే ఏపీ బీజేపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి.. జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ వెళ్లారు. దీంతో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వీడి జనసేన పార్టీలోకి వెళ్తారనే ప్రచారం ఊపందుకుంది. అయితే.. నాదెండ్ల మనోహర్ మాత్రం దాన్ని ఖండించారు. అన్ని విషయాలు త్వరలో తెలుస్తాయని వ్యాఖ్యానించారు సస్పెన్స్ క్రియేట్ చేశారు. దీంతో వీరిద్దరి భేటీపై పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ మధ్య విభేదాలపై చర్చ జరుగుతోంది.
2014 ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కలిసి బరిలోకి దిగాయి. జనసేన అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయకపోయినా.. మిత్ర పక్షాలకు సహకరించారు. దీంతో విజయం సాధ్యమైంది. కానీ.. 2019లో మాత్రం ఎవరికి వారే బరిలో నిలిచారు. దీంతో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. 151 స్థానాల్లో ఘన విజయం సాధించింది. అయితే.. ఒంటరిగా పోటీ చేయడం కారణంగానే జగన్ విజయం సులువైందనే అభిప్రాయాలు మూడు పార్టీల నేతలు వ్యక్తం చేశారు. దీంతో 2024 ఎన్నికల్లో మళ్లీ కలిసి పోటీచేయాలని చాలామంది నేతలు ఆశిస్తున్నారు. అందుకు తగ్గట్టు రాజకీయాలు చేస్తున్నారు.
2019 ఎన్నికల తర్వాత.. జనసేన-బీజేపీ జట్టు కట్టాయి. అయితే.. తెలుగుదేశం పార్టీని కూడా కలుపుకొని ఎన్నికలకు వెళ్లాలని ఇటు పవన్ కళ్యాణ్, అటు బీజేపీలోని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. కానీ.. బీజేపీ కేంద్ర నాయకత్వం, ఏపీ బీజేపీలోని కొందరు నేతలు తెలుగుదేశం పార్టీతో పొత్తును వ్యతిరేకిస్తున్నారు. దీంతో బీజేపీ విభేదాలు భగ్గుమంటున్నాయి. ఈ విషయంలోనే.. సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ మధ్య విభేదాలు స్టార్ట్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా.. ఒక వర్గంపై మరో వర్గం తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ముఖ్యంగా సోము వీర్రాజు వైసీపీకి అనుకూలం అంటూ కన్నా వర్గం ఫైర్ అవుతోంది.
అటు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో మిత్రపక్షమైన బీజేపీ తన పాత్ర పోషించలేదనే కామెంట్స్ తరుచూ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సోము వీర్రాజుపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేస్తోంది కన్నా వర్గం. గ్రానైట్ వ్యాపారంలో వైసీపీ నేతల దగ్గర సోము వీర్రాజు వాటాలు తీసుకున్నారని కన్నా లక్ష్మీనారాయణ వర్గం ఆరోపిస్తోంది. అందుకే ప్రభుత్వంపై బీజేపీ గొంతు గట్టిగా వినిపించడం లేదని.. పార్టీ కార్యక్రమాల పేరుతో భారీగా డబ్బు వసూలు చేస్తున్నారని కన్నా వర్గం ఆరోపణలు చేస్తోంది. కొందరు నేతలు అవినీతి చేస్తున్నా సోము వీర్రాజు పట్టించుకోవడం లేదని ఫైర్ అవుతోంది. ఇలా కోల్ట్ వార్ కంటిన్యూ అవుతున్న సమయంలో.. సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్. దీంతో కన్నా పార్టీ మారడం ఖాయం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa