మంత్రి అంబటి రాంబాబు పై జనసేన అధినేత పవన్కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబటి, వైసీపీ నేతలవి ఉత్తర కుమార ప్రగల్భాలని ఎద్దేవాచేశారు. అంబటి కాపుల గుండెల్లో కుంపటని దుయ్యబట్టారు. ఆయనది శవాల మీద పేలాలు ఏరుకునే మనస్తత్వమని ధ్వజమెత్తారు. తనకు సినిమాలే ఆధారమని, అంబటిలాగా కాదన్నారు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలియడం లేదన్న వ్యక్తి మంత్రా? అని ప్రశ్నించారు. కాపు నేతలతో పచ్చి బూతులు తిట్టిస్తున్నారని మండిపడ్డారు. తానెలా తిరుగుతానో చూస్తామని వైసీపీ గాడిదలు ఓండ్రు పెడుతున్నాయని, బాధ్యత లేకుండా మాట్లాడే నేతలకు బలంగా సమాధానం చెబుతానని పవన్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారబోతోందని ఆయన జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాకుండా చేసే బాధ్యత తనదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa