ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలంలో రోడ్డు నెత్తురోడింది. ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుంది. పనులు చేస్తున్న నలుగురు కూలీలను లారీ చిదిమేసింది. గుడ్లూరు మండలం మోచర్ల వద్ద జాతీయ రహదారి పనుల్లో నిమగ్నమైన కార్మికులపైకి ఒక్కసారిగా లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదం ఘటనా స్థలిలోనే ముగ్గురు దుర్మరణం చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కావలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అయితే, చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. మరో ఇద్దరికి మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. మృతులు మన్నేటికోట, చాగల్లు, సింగరాయకొండ వాసులుగా గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదం జరిగిన వైపుగా వెళ్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు ఈ ఘటనను గమనించి ఆగిపోయారు. ప్రమాదంపై చలించిపోయిన ఎంపీ క్షతగాత్రులను తరలించే చర్యలు చేపట్టారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి వర్గాలను ఆదేశించారు. ఈ సందర్భంగా యాక్సిడెంట్ జోన్గా ఉన్న మోచెర్ల వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తానని ఎంపీ బీద మస్తాన్ రావు వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa