భూ వివాదాలు, భూ తగాదాలు లేని గ్రామాలు ఉండాలన్నదే సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యమని, అందుకే జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్షా పథకాన్ని అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. ఏంఅర్ నగరం గ్రామ రెవిన్యూ పరిధిలో రైతన్నలకు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోగారావు మాట్లాడుతూ.. సమగ్ర సర్వే కారణంగా అన్ని భూ వివాదాలు పరిష్కారం అవుతాయని అన్నారు. దశాబ్దాల తరబడి నెలకొన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. సీఎం వైయస్ జగన్ సారధ్యంలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన వైఎస్ఆర్ జగన్ అన్న శాశ్విత భూహక్కు, భూ పదకం "మీ భూమి - మా హామీ" అనే రీ సర్వే బృహత్తర కార్యక్రమం ద్వారా 100 ఏళ్ల తరువాత రాష్ట్రంలో చేపట్టిన గొప్ప కార్యక్రమం అని అలజంగి జోగారావు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa