ప్రతిపక్ష నేత చంద్రబాబువి సైకో ప్రేలాపనలని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే కంబాల జోగులు విమర్శించారు. విజయనగరం జిల్లా, రాజాం క్యాంప్ కార్యాలయంలో కంబాల జోగులు మీడియాతో మాట్లాడారు. 2019 ఎన్నికలు ఓటమి తరువాత సైకోలా వ్యవహరిస్తుంది మీరే అని చంద్రబాబు తీరుపై ఎమ్మెల్యే కంబాల జోగులు మండిపడ్డారు. విజయనగరం జిల్లాలో రాజాం పరిసర ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన పై తీవ్ర ఆరోపణలు చేయడాన్ని రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు 40ఏళ్లు రాజకీయ ఇండస్ట్రీ, 14ఏళ్లు ముఖ్యమంత్రి అనుభవం అని చెప్పుకునే మీకు రాష్ట్ర ముఖ్యమంత్రిని సైకో అని సంబోధించడం పద్ధతేనా అని సూటిగా ప్రశ్నించారు. 2014 నుంచి 2019 వరకు పరిపాలించింది మీరే కదా రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టింది మీరు కాదా అని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa