ట్రెండింగ్
Epaper    English    தமிழ்

12వేల కేజీల గంజాయి‌ను దహనం చేసిన పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 24, 2022, 04:36 PM

ఏపీ గంజాయి రహితంగా ఉంచేందుకు చర్యలు చేపట్టినట్లు డీఐజీ త్రివిక్రమ్ వర్మ తెలిపారు. 12వేల కేజీల గంజాయి‌ను పోలీసులు దహనం చేశారు. ఈ కార్యక్రమానికి గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ వర్మ, నాలుగు జిల్లాల ఎస్పీలు హాజరయ్యారు. అనంతరం డీఐజీ మాట్లాడారు. 52 పోలీస్ స్టేషన్ల పరిధిలో 146 కేసుల్లో దొరికిన గంజాయిని దహనం చేసినట్లు వెల్లడించారు. న్యాయమూర్తి దగ్గర నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే దహనం చేసినట్లు చెప్పారు. కాజ చెక్ పోస్ట్ దగ్గర ఎక్కువ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. దహనం చేశామని చెప్పడమే కాకుండా దహనం చేసిన ఫోటోలతో సహా ఆధారాలను కోర్టుకు అందించనున్నట్లు స్పష్టం చేశారు. 215 మంది నిందితులను గుర్తించామని.. ఇందులో 185 మందికి శిక్షలు కూడా పడ్డాయని పేర్కొన్నారు. గంజాయి సాగు, రవాణాతో ఏదో సంపాదించాలన్న ఆలోచనను వదిలి పెట్టాలని హెచ్చరించారు. లేదంటే చాలా తీవ్రమైన కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa