కేంద్ర సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యులుగా తెలుగు ఎంపీలు ధర్మపురి అరవింద్, వల్లభనేని బాలశౌరి ఎన్నికయ్యారు. వల్లభనేని బాలశౌరి, ధర్మపురి అరవింద్ ఇద్దరూ లోక్సభ సభ్యులు. మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైసిపి తరపున బాలశౌరి గెలుపొందారు. అరవింద్ నిజామాబాద్ బీజేపీ ఎంపీ.సుగంధ ద్రవ్యాల బోర్డు ఎన్నికల ప్రక్రియ ఇటీవల ప్రారంభం కాగా, నామినేషన్ల దాఖలు ముగిసే సమయానికి ధర్మపురి అరవింద్, వల్లభనేని బాలశౌరి, కేరళ కాంగ్రెస్ ఎంపీ హిబీ ఈడెన్ బరిలో నిలిచారు. అయితే హైబీ ఈడెన్ తన నామినేషన్ను ఉపసంహరించుకోవడంతో ఆ ఎన్నిక రద్దయింది. సర్కిల్లో మిగిలిన ఇద్దరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa