వచ్చే ఎన్నికల్లో వైకాపా పతనం పులివెందుల నుంచే ప్రారంభమవుతుందని ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఓడించి తీరుతామని ఎమ్మెల్సీ, పులివెందుల నియోజకవర్గ తెదేపా ఇన్చార్జి బీటెక్ రవి పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం వేంపల్లి మండలంలోని నందిపల్లిలో ఇదేం ఖర్మ. మన రాష్ట్రానికి' కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కుంటి సాకులతో వందల రేషన్ కార్డులు, పింఛన్లు తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం దుర్మార్గమన్నారు. ఈ చర్యలతో పేదలకు సంక్షేమ పథకాలు. అందవని ఇది కేవలం కుట్రపూరితమేనన్నారు. పులివెందుల నియోజకవర్గంలో వర్షాలకు దెబ్బతిన్న శనగ, పత్తి పంటలకు పరిహారం ఇప్పించే విషయంలోనూ పాలకులు శ్రద్ధ చూపించలేదన్నారు. పులివెందులలోనే
జగన్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని. వచ్చే ఎన్నికల్లో 175కు 175 సీట్లు ఎలా సాధిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో వేంపల్లి మండల టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa