ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాడి మోయాల్సి రావడం బాధాకరం: బాలకృష్ణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 29, 2022, 05:43 PM

పార్టీ జెండా మోసే కార్యకర్తల పాడె మోయాల్సి రావడం అత్యంత బాధాకరమని టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ వివరించారు. కందుకూరు ఘటనలో కార్యకర్తలు ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కందుకూరులో 8 మంది మరణించారన్న వార్త 80 లక్షల మంది కార్యకర్తల కుటుంబాల్లో విషాదం నింపిందని పేర్కొన్నారు. కార్యకర్తల మృతి మనసును కలచివేసిందని తెలిపారు. పార్టీ జెండా మోసే కార్యకర్తల పాడె మోయాల్సి రావడం అత్యంత బాధాకరమని బాలకృష్ణ వివరించారు. చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa