విద్యార్థులలో నైతిక విలువలు, జ్ఞానం పెంపొందించడానికి పుస్తక పఠనం చాలా ముఖ్యమని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొత్త మాధవరం ప్రధానోపాధ్యాయురాలు నాగలక్ష్మి అన్నారు. ఆమె శుక్రవారం మాట్లాడుతూ చరిత్రలు, రామాయణ మహాభారత ఇతిహాసాలు ధర్మ విలువలు , అన్నదమ్ముల అనుబంధాలు , తల్లి తండ్రుల పట్ల , ఉపాధ్యాయుల పట్ల పెద్దలపట్ల ఎలా మెలగాలో పుస్తక పఠనం నేర్పిస్తుందని అన్నారు.
సేవ్ ది చిల్డ్రన్ సంస్థ సన్ ఫౌండేషన్ సహకారంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కొత్త మాధవరం నందు లైబ్రరీ బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. లాంగ్వేజ్ డెవలప్ కావడానికి లైబ్రరీ ఎంతో దోహదపాడుతుందని ఉపాధ్యాయులు అన్నారు. ఈ లైబ్రరీ ని ఉపయోగించుకొని అవసరమైన బుక్స్ చదివి భావి భారత పౌరులుగా ఎదగాలని సేవ్ ది చిల్డ్రన్ సంస్థ సిబ్బంది రఫీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్య క్రమం నందు స్కూల్ హెడ్ మాస్టర్ మ్ నాగలక్ష్మి , సేవ్ ది చిల్డ్రన్ సంస్థ సిబ్బంది రఫీ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa