ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూలీగా పనిచేసిన చోటే డిప్యూటీ మేయర్ గా వెళ్లింది

national |  Suryaa Desk  | Published : Sun, Jan 01, 2023, 08:21 PM

తలరాత అంటే ఇదేనేమో. బిహార్ మున్సిపల్ ఎన్నికల్లో ఓ పారిశుద్ధ్య కార్మికురాలు చరిత్ర సృష్టించారు. శుక్రవారం బిహార్ రెండో దశ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు వెల్లడికాగా... చింతా దేవి అనే పారిశుద్ధ్య కార్మికురాలు విజయం సాధించారు. గయ నగర కార్పొరేషన్‌లో డిప్యూటీ మేయర్‌గా పోటీ చేసి ఘన విజయం సాధించడం విశేషం. డిప్యూటీ మేయర్ పదవి కోసం చింతా దేవితో పాటు మరో 10 మంది పోటీ పడగా.. ఆమెకు 50,417 ఓట్లు పడ్డాయి. తన సమీప ప్రత్యర్థిపై 16వేలకు పైగా ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో గయ చరిత్రలో ఈ పదవిని ఓ పారిశుద్ధ్య కార్మికురాలు చేపట్టడం ఇే తొలిసారి.


గత 40 ఏళ్లుగా మున్సిపల్‌ కార్పొరేషన్‌లో స్వీపర్‌గా పనిచేస్తున్న చింతా దేవి.. ఈ ఎన్నికల్లో కార్పొరేషన్‌ సిబ్బందితో పాటు కార్మికుల యూనియన్‌, స్థానికుల మద్దతుతో విజయాన్ని అందుకున్నారు. మాజీ డిప్యూటీ మేయర్ సహా పలు రాజకీయ పార్టీలు కూడా ఆమెకు మద్దతిచ్చాయి. అలాగే, నగర పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో సన్నూ కుమారి అనే 21 ఏళ్ల వైద్య విద్యార్థిని అరారియా స్థానం నుంచి చీఫ్‌ కౌన్సిలర్‌గా గెలుపొందింది. ఐదు సార్లు ఎంపీగా చేసిన సుఖ్‌దేవ్‌ పాశ్వాన్ భార్య నీలం దేవిని ఆమె ఓడించడం చెప్పుకోదగ్గ అంశం.


అయితే, గయ ఎన్నికల్లో సామాన్యులు, కూలీలు గెలవడం ఇదే మొదటిసారి కాదు. 1996 లోకసభ ఎన్నికల్లో నితీశ్ కుమార్ పార్టీ జేడీయూ తరఫున స్టోన్ క్రషర్‌లో పనిచేసే కార్మికురాలు భగవతి దేవి గయ స్థానం నుంచి పోటీచేసి గెలుపొందారు. ‘గయ అనేది ప్రజలు జ్ఞానోదయం కోరుకునే ప్రదేశం.. ముసహర్ మహిళ లోక్‌సభకు వెళ్లిన ప్రదేశం కూడా ఇది.. ఇక్కడ మరుగుదొడ్లు తక్కువగా ఉన్న సమయంలో మలాన్ని తలపై మోసిన చింతాదేవిని పారిశుద్ధ్య సిబ్బందిగా ఎన్నుకోవడం ద్వారా ఇక్కడి ప్రజలు ఈసారి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు. ఇది చారిత్రాత్మకం’’ అని గయ మేయర్‌గా ఎన్నికైన గణేశ్ పాశ్వాన్ వ్యాఖ్యానించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa