ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పదిహేను శాతం పెరుగుదలతో జీఎస్టీ వసూళ్లు

national |  Suryaa Desk  | Published : Sun, Jan 01, 2023, 08:28 PM

డిసెంబరులో 15 శాతం పెరుగుదలతో రూ.1,49,507 కోట్ల జీఎస్టీ వసూలైనట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నేడు వెల్లడించింది. తెలిపింది. ఇందులో కేంద్ర జీఎస్టీ రూ.26,711 కోట్లు కాగా, రాష్ట్ర జీఎస్టీ రూ.33,357 కోట్లు అని వివరించింది. సమీకృత జీఎస్టీ రూ.78,434 కోట్లు (దిగుమతులపై వసూలైన పన్నుల మొత్తం రూ.40,263 కోట్లతో కలిపి), సెస్ రూ.11,005 కోట్లు (దిగుమతులపై వసూలైన రూ.850 కోట్లతో కలిపి) వసూలైనట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా, జీఎస్టీ ఆదాయం వరుసగా పదో నెల కూడా రూ.1.4 లక్షల కోట్లు దాటడం విశేషం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa