ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైనది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 03, 2023, 03:28 PM

‘ఒక్కచాన్స్‌’ అంటూ ముఖ్య మంత్రి జగన్మోహన్‌ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని టీడీపీ ఎర్రగొండపాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. మండలంలోని గుండంచర్లలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎరిక్షన్‌బాబు మాట్లాడుతూ....  వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన అంతమొందాలంటే ప్రజల్లో తిరుగుబాటు రావాలన్నారు. ‘రాష్ట్రానికి ఇదేం ఖర్మ’ పేరుతో టీడీపీ చేపట్టిన కార్యక్రమానికి ప్రజలు పెద్దఎత్తున మద్దతు తెలపాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మెట్టు శ్రీనివాసరెడ్డి, టీడీపీ నాయకులు గొట్టం శ్రీనివాసరెడ్డి, చంద్రగుంట్ల నాగేశ్వరరావు, ఇండ్లా రామకృష్ణారెడ్డి, లింగాల అబ్రహం, దండా వెంకటేశ్వరరెడ్డి, నక్కా శ్రీను, తోకల ఎల్లయ్య, చంద్రశేఖర్‌రెడ్డి, పాలంకయ్య, పోలురాజు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa