ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజా గొంతుకను అణిచివేయాలనే ఈ ప్రయత్నం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 03, 2023, 03:46 PM

ప్రభుత్వ కుట్ర ఫలితమే కందుకూరు, గుంటూరు ఘటనలని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. సభలు, రోడ్డు షోలపై ఆంక్షలు విధించడం చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబు అంటేనే జగన్  భయపడుతున్నాడని అర్ధమవుతోందన్నారు. ఒకవైపు చంద్రబాబు సభలకు జనాలు పోటెత్తడం.. మరోవైపు జగన్ సభలకు ఖాళీ కుర్చీలు కనిపించడంతో రాష్ట్రంలో జగన్ పని అయిపోయింది అనే మాట తరచూ వినిపిస్తోందన్నారు. ఈ క్రమంలోనే ఇటువంటి ఆంక్షలు విధిస్తున్నారన్నారని నిమ్మల పేర్కొన్నారు. జీవోలు, 30 యాక్ట్‌లు ప్రతిపక్షానికే వర్తిస్తాయని.. అధికార పక్షానికి వర్తించవన్నారు. రోడ్ షో  చేయకూడదని ఆంక్షలు విధించిన జగన్ నేడు రాజమండ్రిలో మున్సిపల్ స్టేడియం నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకూ ఎలా రోడ్ షో నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ప్రజా గొంతుకను అణిచివేయాలనే ఈ ప్రయత్నానికి వ్యతిరేకంగా ఎన్ని కేసులు పెట్టినా.. ఎంతమందిని అరెస్టు చేసినా, ఎంత మందిని జైల్లో పెట్టినా లక్షలాదిమందిగా సభలకు వస్తాం, రోడ్డెక్కుతామని నిమ్మల పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa