జగన్ ప్రభుత్వ తుగ్లక్ జీవోలు ప్రతిపక్షాలను అడ్డుకోలేవని భీమవరం టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. నియోజవర్గ ముఖ్యనాయకులతో గురువారం సమావేశం నిర్వహించారు. అనంతరం జగన్ సర్కార్ తీసుకువచ్చిన జీఓ 1 ప్రతులను చించి దహనం చేశారు. ముందుగా బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ.... చంద్రబాబు కుప్పం పర్యటనలో టీడీపీ నాయకులపై పోలీసులు అక్రమ కేసులు పెట్టడం దారుణం అన్నారు. రాష్ట్ర కోశాధికారి మెంటే పార్ధసారధి, మెరగాని నారాయణమ్మ మాట్లాడుతూ రహదారులు కూడళ్లలో సభలను, ర్యాలీలను నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన చీకటీ జీవోతో ప్రతిపక్షాల గొంతు నొక్కడం అవివేకమన్నారు. ఎండీ నౌషాద్, రేవు వెంకన్న, పృద్వి శంకర్, తమ్మినీడి నాగేశ్వరరావు, సయ్యద్ నసీమాబేగం, మెంటేగోపి, చెల్లబోయిన సుబ్బారావు, సీహెచ్ గోవిందు, గంటా త్రిముర్తులు, మద్దుల రాము, మిర్తిపాటి గున్నేశ్వరరావు, గూడూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa