ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కళావెంకటరావు కీలక వ్యాఖలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 07, 2023, 10:25 PM

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కళావెంకటరావు మండిపడ్డారు. తిరుమలలో కొలువైన శ్రీవేంకటేశ్వర స్వామి భక్తుల సౌకర్యార్థం నిర్మించిన వసతి గృహాల రేట్లు పెంచి భక్తులపై పెనుభారం మోపడం దురుద్దేశంతో కూడుకున్నదని విమర్శించారు. నిన్న లడ్డూ రేట్లు పెంచి, నిన్న బస్ చార్జీలు పెంచి... నేడు వసతి ధరలు పెంచి తిరుమల వెంకన్నను భక్తులకు దూరం చేసే ప్రయత్నం చేశారు. రూ.50 నుంచి రూ.200 వరకు ఉన్నఅద్దె గదుల రేట్లను రూ.750 నుంచి రూ.2,300కు పైగా పెంచటం దుర్మార్గం అని పేర్కొన్నారు. గత మూడేళ్లుగా దేవుడి భక్తులను దూరం చేసే చర్యల్లో భాగమే అద్దె గదుల రేట్ల పెంపుదల అని కళా వెంకటరావు ఆరోపించారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa