ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మైలవరం అన్న క్యాంటీన్ కు రెండు లక్షల విరాళం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 08, 2023, 10:28 AM

176 రోజులుగా మైలవరంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ కు ప్రవాస ఆంధ్రులు 2 లక్షల రూపాయల విరాళాన్ని శనివారం అందజేశారు. ఈ సందర్భంగా తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వర మాట్లాడుతూ.. చిత్తూరు జిల్లా మదన పల్లికి చెందిన లోకేష్ నాయుడు, ఈమని మురళీకృష్ణ లు అన్న క్యాంటీన్ కు విరాళం అందజేయటం అభినందనీయమన్నారు. పేదల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ భాగస్వాములై ముందుకు రావాలన్నారు. ప్రవాసా ఆంధ్రులు మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చారని, జగన్ రెడ్డి అత్యాయత్నం కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు. ఉయ్యూరు శ్రీనివాస్ విషయంలో ఇదే జరగా న్యాయదేవత ధర్మాన్ని కాపాడిందన్నారు. కందుకూరు, గుంటూరులలో వైసిపి నాయకులే చంపేశారని అన్నారు. చీకటి జీవో లిచ్చి ఏకపక్షంగా విపాక్షాలను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, కొంతమంది అధికారులు తొత్తులుగా పనిచేయడం వల్ల వ్యవస్థలకు చెడ్డ పేరు వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa