వైసీపీ ప్రభుత్వంలో దళితులకు రక్ష ణ లేకుండా పోతోందని టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి బేకరీ గంగాధర్ ఆరోపించారు. కావలిలో దళితులపై జరిగిన దాడుల్లో దుగ్గిరాల కరుణాకర్, పైడి హర్ష, తేజ హత్యలను ఖండిస్తూ శనివారం స్థానిక అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం నాయకులు విలేకరులతో మాట్లాడారు. కావలి ఘటన నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైసీపీ అసమర్థ ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దళితు లపై హత్యలు, దాడులు విపరీతంగా పెరిగాయన్నారు. ఎస్సీ కార్పొరేషన్లకు కేటాయించిన నిధులు దుర్వినియోగం చేశారన్నారు. దళితుల హత్యాకాండను నిరసిస్తూ ఈనెల 10న తలపెట్టిన చలో కావలి కా ర్యక్రమాన్నికి దళితులు తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. కన్వీనర్ రంగారెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. వైసీపీకి బుద్ది చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అంతకుముందు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు ఆటో సజ్జప్ప, నారాయణప్ప, నంజుండ, రామాంజి, రాజు, కదిరప్ప, నరసింహప్ప, వెంకటేశులు, నాయకులు నందీషప్ప, రజనీకుమార్, అశ్వత్తప్ప, రామప్ప, నారాయణప్ప, విశ్వనాథరెడ్డి, నరేంద్ర, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa