తిరుమలలో వసతి గృహాల అద్దెలు పెంచడం శోచనీయమని కడప జిల్లా టీడీపీ వేంపల్లె మండల కన్వీనర్ రామమునిరెడ్డి, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షబ్బీర్ విమర్శించారు. శనివారం స్థానిక వృషభాచలేశ్వర దేవస్థానంలోని వేంకటేశ్వరస్వామి విగ్రహానికి టీడీపీ నాయకులు నీ కొండను నువ్వే కాపుడుకోవాలని వినతిపత్రం అందించారు. అనంతరం నందకం, పాంచజన్యం, కౌస్తుభం, వకుళమాత వస తి గృహాల్లో రూ. 50, రూ.100 లకే గదులు అద్దెకు ఉండేవని, ఇపుడు రూ. 500, రూ.600, రూ.1000 వరకు పెంచడం దారుణమన్నారు. నారాయణగిరి గెస్ట్ హౌస్లో కూడా భారీగా పెంచడం దారుణమన్నారు. అద్దెతో పాటు డిపాజిట్ను అంతే మొత్తంలో చెల్లించాల్సి ఉంద న్నారు. పట్టణ అద్యక్షుడు రమేష్, మండల ప్రధాన కార్యదర్శి మహ మ్మద్, మైనార్టీ నాయకులు పూల బక్షు, మహబూబ్ షరీఫ్, షఫీవుల్లా, డక్కా రమేష్, ఇలి యాజ్, ఈశ్వరయ్య, యుగంధర్, వెంకటయ్య, మారుతి, టీవీ మెకానిక్ శ్రీను, యాసిన్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa