రాష్ట్రంలో పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వేల కోట్ల రూపాయల బియ్యాన్ని అమ్ముకున్న ఏకైక సీఎం జగన్మోహన్రెడ్డి అని టీడీపీ కోవూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్రెడ్డి ధ్వజమెత్తారు. ‘‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి ’’ కార్యక్రమం సందర్భంగా ఆదివారం ఆయన స్థానిక 15,16వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ సీఎం పాలన తీరు చూస్తుంటే ఇది భారత రాజ్యాంగమా లేక రాజారెడ్డి రాజ్యాంగమా అని ప్రశ్నించారు. చట్టబద్దత లేని జీవో నెంబరు 1 ఉద్దేశం ఇతర రాజకీయపార్టీలేవీ రోడ్లుపైన సమావేశాల పెట్టకుండా వైసీపీ వారు మాత్రమే నిర్వహించుకునేందుకేనన్నారు. మీడియా స్వేచ్ఛను హరించేందుకు 2,3,4 జీవోలు తెచ్చారన్నారు. హైకోర్టు మొట్టికాయలు వేసి రద్దు చేసిందన్నారు. వెంటనే సీఎం జీవో నెంబరు 1ని రద్దు చేసి, ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు ఎంవీ.శేషయ్య, నెల్లూరు ప్రభాకర్రెడ్డి, చెముకుల కృష్ణచైతన్య, బండ్ల కొండయ్య, జూగుంట పురుషోత్తం, వల్లూరు శ్రీనివాసులు, కిషోర్, కొండయ్య యూత్, హరీష్, మైనారిటీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa