జగనన్న ప్రభుత్వంలో ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తున్నారని శృంగవరపుకోట శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంగళవారం శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండలం నిమ్మలపాలెం గ్రామంలో 154వ రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడుబండి గ్రామంలో గడపగడపకు వెళ్లే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు విపులంగా వివరించి, కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు ప్రజాసంకల్పయాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి ఒక్క హామీను కరోనా విపత్కర పరిస్థితులను సైతం ఎదుర్కొని నెరవేర్చారని ఆయన కొనియాడారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని ఆయన అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు ముఖ్యమంత్రిని మరలా ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కోన దేముడు, వైస్ సర్పంచ్ దేవుడు, పి ఎస్ ఎన్ పాత్రుడు తదితర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa