ముఖ్యమంత్రి జగనన్న సంక్షేమ పథకాలకు జనం జేజేలు పలుకుతున్నారని కడప వైఎస్ అవినాష్ రెడ్డి కొనియాడారు. జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా పులివెందుల పట్టణంలో స్థానిక వైఎస్సార్ ఆడిటోరియంలో సోమవారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత అన్ని రంగాలల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యమన్నారు. అసమానతలు తొలగి అందరికీ సమానస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలన్న ఉద్దేశంతో వాలంటీరు, సచివాలయ వ్యవస్థల కు నాందిపలికారన్నారు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందు పరచిన అన్ని అంశాలు పూర్తిస్థాయిలో నెరవేర్చామన్నారు. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు కూడా వారి విధులను సమర్థవంతంగా నిర్వహించడంతో ప్రభుత్వానికి ఆశించినస్థాయి లో ఫలితాలు లభించాయన్నారు. ప్రతి ఏటా వాలంటీర్ల సేవలకు పురస్కారాలు అందజేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో వైసీపీ మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa