మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడిని బుధవారం జిల్లాలోని పలువురు ప్రముఖలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన్ను స్వర్ణభారత్ ట్రస్టులో కొందరు సందర్శకులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా కలిసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వారందరిని వెంకయ్యనాయుడు ఆత్మీయంగా పలకరించారు. టీడీపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలను అందజేశారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి వెంకయ్యను కలిసి కొద్దిసేపు ముచ్చటించారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ చెంచలబాబు యాదవ్, బీసీ సాధికార సమితి జిల్లా కన్వీనర్ కుంకాల నాగేంద్రప్రసాద్, టీడీపీ మండలాధ్యక్షుడు గుమ్మడి రాజాయాదవ్, నాయకులు కోదండయ్యనాయుడు, ధనుంజయనాయుడు, నాగార్జున్రెడ్డి, జన్ని రమణయ్య, ఖాయ్యుమ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. అలాగే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేంద్రరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం విజయకుమార్, జిల్లా కార్యదర్శి అల్లూరు ప్రసాద్ నాయుడు తదితరులు కూడా వెంకయ్యను కలిశారు. అలాగే రాష్ట్ర మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి కూడా కలిశారు. ఈ సందర్భంగా శాలువా కప్పి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. ఆయన వెంట మాజీ జడ్పీటీసీ వెంకటశేషయ్య, నాయకులు నాటకం శ్రీనివాసులు, కడివేటి శివ, నరేష్ నాయుడు, బదనాపూరి గోపాల్, గిరిష్ తదితరులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa