తెలంగాణ నంబర్ వన్. బిహార్ నెంబర్ 2. ఆ తర్వాత గుజరాత్... మరెన్నో రాష్ట్రాలు... తమిళనాడు, కర్ణాటక, కేరళ కూడా మనకంటే పైనే. అక్షరక్రమంలో అగ్రభాగన ఉండే ఆంధ్రప్రదేశ్ మాత్రం అట్టడుగు స్థానంలోనే. ఇదీ వ్యవసాయ సేవల రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు(ఎ్ఫడీఐ)ల అకర్షణలో రాష్ట్రం పరిస్థితి. సాగు రంగంలో ఎఫ్డీఐలను ఆకర్షించడంలో ఏపీ అథమ స్థానంలో నిలిచింది. 2021 కేంద్ర వ్యవసాయ గణాంకాల నివేదిక ప్రకారం.. తెలంగాణ 49.44 (26.32) మిలియన్ డాలర్ల ఎఫ్డీఐలతో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. బిహార్ 39.5(21.03)మిలియన్ డాలర్లతోరెండో స్థానంలో ఉండగా, గుజరాత్ 30.49 (16.23ు) మిలియన్ డాలర్లతో మూడో స్థానంలో ఉంది. 2019 అక్టోబరు నుంచి 2021 సెప్టెంబరు వరకు దేశానికి 187.85 మిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు రాగా అందులో ఏపీకి కేవలం 0.12 (0.06)మాత్రమే రావడంపై వ్యవసాయ రంగ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa