ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హిందూవుల మనోభావాలు దెబ్బతీయడానికి సీఎం జగన్ కుట్రలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 12, 2023, 04:59 PM

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు  కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ హిందూవుల మనోభావాలు దెబ్బతీయడానికి సీఎం కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వచ్చే సంక్రాంతి తర్వాత.. జగన్ ఇంటికేనని.. దేవాలయాలపై దాడి చేసిన వారిని ఎవరూ పట్టించుకోరని, తిరుమలకు భక్తులు రాకుండా ఉండేందుకు కుతంత్రాలు జరుగుతున్నాయన్నారు. టీటీడీ వసతి గృహాలు అద్దెలు పెంచడం అంటే... భక్తుల నుంచి దోపిడీ చేయడమేనని అన్నారు. వెంకటేశ్వర స్వామి దగ్గరకు భక్తులు రాకూడదనే దురుద్దేశ్యంతోనే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. టీటీడీ వసతి గృహాల అద్దెలు పెంపు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని విష్ణుకుమార్ రాజు స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa