అమెరికా వెళ్లాలనుకొనే వారికి తడిసిమోపేడయ్యేవార్త ఇది. హెచ్-1బీ, ఎల్-1ఏ, ఎల్-1బీ వంటి నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాల పిటిషన్లు, అప్లికేషన్ల ఫీజులను భారీగా పెంచుతూ బైడెన్ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ ఫీజులకు సంబంధించిన ప్రతిపాదనలను యూఎస్సీఐఎస్ వెబ్సైట్ ద్వారా తెలిపింది. హెచ్-1బి, హెచ్-2బి, ఎల్-1, ఓ-1, ఈబీ-5 వీసాల రుసుములు భారీగా పెరగనున్నాయి. అయితే వీటిలో ఎక్కువగా తమ ఉద్యోగులను అమెరికాకు పంపించే కంపెనీలు భరించేవే ఉన్నాయి.
తాజా ప్రతిపాదనల ప్రకారం.. హెచ్-1బీ (H-1B) వీసా దరఖాస్తు ధరను 460 డాలర్ల నుంచి 780 డాలర్లకు పెరిగింది. ఎల్-1 (L-1) వీసా ధర 460 డాలర్ల నుంచి ఏకంగా 1385 డాలర్లకు.. O-1 వీసా ధరను 460 డాలర్ల నుంచి 1,055 డాలర్లకు పెంచాలని ప్రతిపాదించారు. హెచ్-2బీ (H-2B) వీసా ధరను 460 డాలర్ల నుంచి 1,080 డాలర్లకు పెంచేందుకు ప్రతిపాదనలు చేశారు. మరోవైపు గ్రీన్ కార్డు (ఈబీ-5) దరఖాస్తుల రుసుములు 3,675 డాలర్ల నుంచి 11,160 డాలర్లకు పెరిగే అవకాశం ఉంది. హెచ్-1బి ఇ రిజిస్ట్రేషన్ రుసుము ప్రస్తుతం 10 డాలర్లు కాగా తాజా ప్రతిపాదన అమలులోకి వస్తే 215 డాలర్లు చెల్లించాల్సి వస్తుంది.
ఈ ఫీజుల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలు 60 రోజుల పాటు వెబ్సైట్లో ఉంచుతారు. ఆ తర్వాత అభిప్రాయాలను స్వీకరించి అమల్లోకి తీసుకురానున్నారు. బైడెన్ ప్రభుత్వం ఖర్చు భారాన్ని తగ్గించుకునేందుకు ఈ ఫీజులను పెంచినట్లు చెబుతున్నారు. ఈ నిర్ణయంతో పెండింగ్ వీసాల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉంది అనుకుంటున్నారు. అంతేకాదు 2016 నుంచి వీసా దరఖాస్తు రుసుముల్లో మార్పు చేయలేదట.. అయితే ఆరేళ్ల తర్వాత వాటిని పెంచాలని ప్రతిపాదించారు. గతేడాది అత్యధికంగా 1,25,000 మంది భారతీయ విద్యార్థులకు వీసాలు జారీ చేసినట్లు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa